రేపు అరుణ్ జైట్లీ అంత్యక్రియలు
అరుణ్ జైట్లీ పార్ధివదేహాన్ని ఢిల్లీలో కైలాష్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు.
అరుణ్ జైట్లీ పార్ధివదేహాన్ని ఢిల్లీలో కైలాష్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. రేపు ఉదయం 10 గంటల వరకు సన్నిహితుల సందర్శనార్ధం జైట్లీ పార్ధివ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయానికి.. ఆదివారం ఉదయం 11 గంటలకు తరలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో.. కార్యకర్తల సందర్శనార్ధం ఉంచనున్నారు.. అనంతరం జైట్లీ అంతిమ యాత్ర నిర్వహించనున్నారు.. నిగ్ మోద్ ఘాట్ లో జైట్లీ అంత్యక్రియలు జరగనున్నాయి.