ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు పలువురు ఎంపీలతో కలిసి హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న జగన్ అమిత్షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని హామీలు, పెండింగ్ సమస్యలను అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి జగన్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన నివేదికను అమిత్షాకు అందజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించాల్సిందిగా అమిత్ షాను కోరారు. విభజన హామీలను వీలైనంత త్వరగా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.