వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఇందుకు ముంబై కోర్టు అనుమతి ఇచ్చింది. 13వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం వేలం వేయనుంది. అయితే, జనవరి 18 తరువాత మాత్రమే ఈ ఆదేశాలను పాటించాలని కూడా కోర్టు వెల్లడించింది. దీనిపై సంబంధిత పార్టీలు ఈ ఆదేశాలపై ముంబై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని సూచించింది.