కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

Update: 2019-06-18 03:26 GMT

జమ్మూకశ్మీర్ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్ జిల్లా వాగ్ హోం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎంత మంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వాగ్ హోం ప్రాంతంలో గాలిస్తున్నాయి. మరోవైపు అనంత్‌నాగ్‌ జిల్లా అచాబల్‌ ప్రాంతంలో నిన్న భద్రతాదళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఉగ్రవాది అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మరో ఆర్మీ మేజర్‌, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఒకవైపు ఎన్ కౌంటర్లు, పుల్వామాలో ఉగ్రవాదుల దాడులు, సరిహద్దుల్లో పాక్ సైనికుల కాల్పులతో జమ్మూకశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News