బంపర్ ఆఫర్.. ఉచితంగా విమాన ప్రయాణం..
ప్రముఖ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియానే ఈ బంపర్ ప్రకటించింది. ఫ్రీగా విమాన టికెట్ గెలుచుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం డ్రిమ్ లైన్ పోటి నిర్వహిస్తోంది.
జీవితంలో ఒక్కసారైనా విమానం లోపల అడుగు పెట్టాలనీ, ఎయిర్ హోస్టెస్లు సీటు బెల్టు పెడుతుంటే... విమానం టేకాఫ్ అవుతుంటే... ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనీ కలలుగనే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ అలా అనుభవించలంటే వేలల్లో డబ్బు ఖర్చుఅవుతుంది కదా! అలాంటి ఉచితంగా ప్రయాణించవోచ్చు. నమ్మలేకపోతున్నారా! ఇది నిజం. ప్రముఖ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియానే ఈ బంపర్ ప్రకటించింది. ఫ్రీగా విమాన టికెట్ గెలుచుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం డ్రిమ్ లైన్ పోటి నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలకు ఉచితంగా విమాన టికెట్ సొంతం చేసుకోవచ్చు. ఇద్దరు ఇంటర్నేషనల్ రిటర్న్ టికెట్లను గెలుచుకోవచ్చు. 18 ఏళ్లకు పైబడి వయసు ఉన్న భారతీయులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రజలు ఈ పోటీలో పాల్గొని ఎయిర్ ఇండియా యొక్క 787 డ్రీమ్లైనర్ గురించి ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
ఎయిర్ ఇండియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో డ్రీమ్ ఆన్ ఏ 787 డ్రీమ్లైనర్ కాంటెస్ట్ అందుబాటులో ఉంది. 2019 సెప్టెంబర్ 7 వరకు ఈ కాంటెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యాడ్ నెట్వర్క్ ద్వారా పోటీలో పాల్గొనవచ్చు. ఆన్లైన్ లక్కీడ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యాడ్ నెట్వర్క్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా ప్రజలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మరియు అంతర్జాతీయ రిటర్న్ టిక్కెట్లను గెలుచుకునే అవకాశాన్ని పొందండి" అని ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆన్లైన్ లక్కీడ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. గెలుపొందిన వారి పేర్ల ప్రకటన తర్వాత వారు వారం రోజులుగా వివరాలను కంపెనీకి అందించాలి. విజేతల పేర్ల ప్రకటన తేదీ నుంచి టికెట్లకు ఏడాది వాలిడిటీ ఉంటుంది. అంటే ఈ కాలంలో మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణించొచ్చు అన్నమాట.