కేంద్రం నూతన విద్యావిధానంపై తమిళ అగ్రహీరో సూర్య చేసిన సంచలన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నీట్ పరీక్షలు ఉత్తరాది వారికే లబ్ధి చేకేరేలా ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. దీంతో నటుడు సూర్యను టార్గెట్ చేయడంతో మనస్ధపం చెందిన ఆయన భావోద్వేగ లేఖను విడుదల చేశారు.
నీట్ గురించి మాట్లాడే అర్హతలేదంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విద్యాభ్యాసంలో ఇబ్బందులపై మాట్లాడితే తప్పేంటి అన్న ఆయన నన్ను టార్గెట్ చేయడం బాధకలిగిందన్న ఆయన తన భార్య జ్యోతిక సినిమాను నిరసన కారులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. జాతీయ పౌరుడిగా మాట్లాడే అర్హత ఉందని... ప్రతి పేదవాడికి ఉన్నత విద్యను అభ్యసించే హక్కు ఉందన్నారు.