ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే డబ్బునో, బంగారాన్నో, లేదా ఏమైనా విలువైన వస్తువులనో దొంగతనం చేస్తారు. కాని ఎవరూ ఉహించని విధంగా ఓ వృద్ధుడు పూలకుండీని దొంగిలించాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అసలు ఈ పని ఎక్కడ, ఎవరు చేసారో తెలుసుకుందాం.
ఢిల్లీలోని ఓ ఫ్లై ఓవర్ పిల్లర్కు ప్రభుత్వ అధికారులు వర్టికల్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. అక్కడ వున్న ఆ పూలకుండీలో ఆ తాతకి ఏం కనిపించిందో దాన్ని దొంగిలించాడు. చుట్టుపక్కన ఎవరైనా చూస్తున్నారా లేదా అని గమనించిన ఆ తాత ప్లాస్టిక్ పూలకుండీని తీసుకుని మట్టిని కింద పడేసి.. తన దగ్గర ఉన్న బ్యాగులో వేసుకుని పరుగులు తీసాడు. ఈ దృశ్యాలు అక్కడున్న ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.