న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్డీఎక్స్ కలకలం రేపింది. తెల్లవారుజామున టర్మినెల్ 3 దగ్గర అనుమానాస్పదంగా బ్యాగ్ లభించింది. వెంటనే స్పందించిన CISF అధికారులు బ్యాగ్ను ఎయిర్పోర్టు పరిసరాల నుంచి దూరంగా తరలించారు. బ్యాగ్లో ఎలక్ట్రానిక్ పేలుడు పదార్థాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. డాగ్ స్క్వార్డ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.