యూపీ గోరక్ పూర్లోని మోహదీపూర్లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనదారుడ్నిఢీ కొట్టింది. కారు వేగానికి అక్కడ ఉన్న మరికొంతమంది ఎగిరి పడ్డారు. మొత్తం ఎనిమిది మందికి తీవ్రగాయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే వెంటనే కారు డ్రైవర్ ని అరెస్ట్ చేసి బ్రీత్ అనలైజర్ పరీక్షించినప్పటికీ పరీక్షా ఫలితాలు సాధారణమని వచ్చాయి. అయితే పోలీసుల విచారణలో ప్రమాదానికి గల కారణలు తెలిపారు. కారు డ్రైవర్ బ్రేక్ లకు బదులుగా యాక్సిలరేటర్ నొక్కడం ద్వారాలనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పులువురికి తీవ్రగాయాల పాలయ్యారు. గాయపడిన వారికి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.