కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిది మంది మృతి

మహారాష్ట్ర ధూలెలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ధాటికి 8 మంది మృతి చెందగా.. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2019-08-31 05:59 GMT

మహారాష్ట్ర ధూలెలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ధాటికి 8 మంది మృతి చెందగా.. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100మంది కార్మికులు ఉన్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అధికారులు హుటాహుటానా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

Tags:    

Similar News