జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం చేసే ముందు కశ్మీర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కశ్మీర్లోని వివిధ జైళ్లల్లో ఉన్న పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాదులు, ఉగ్రవాదులు మొత్తం 70 మందిని కశ్మీర్ నుంచి తరలించారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని ఆగ్రా జైలుకు తరలించారు. మరోవైపు ఇటీవల పాక్ తీసుకున్న నిర్ణయాలపై కూడా మోడీ స్పందిస్తారని తెలుస్తోంది. దీంతో మోడీ ఏం చెబుతారనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతుంది.