మహారాష్ట్రలో ఆగని కరోనా కల్లోలం..24 గంటల్లో..

Update: 2020-05-27 06:07 GMT

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 2091 పాజిటివ్ కేసులు, 97 మరణాలు సంభవించాయి. దీనితో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 54, 758కి చేరింది. ఇప్పటివరకు 1792 మంది మృత్యువాతపడ్డారు. 

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 6,387 కేసులు నమోదు కాగా, 170 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మొత్తంగా భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,51,767కు చేరుకోగా, మృతుల సంఖ్య 4,337కు చేరింది.

Tags:    

Similar News