యూపీలో రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని షాహజాన్‌పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు టెంపోలను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 16 అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2019-08-27 07:11 GMT

ఉత్తరప్రదేశ్‌లోని షాహజాన్‌పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు టెంపోలను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 16 అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.   

Tags:    

Similar News