ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అని తాను అనలేదని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్ స్పష్టం చేశారు. హోదాపై వైసీపీ నిబద్ధత ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మీడియాకు వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై తాను మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయకుండా ఎడిట్ చేసి వివాదాస్పదం చేశారని పీవీపి మండిపడ్డారు. తానంటే ఏమిటో బెజవాడ ప్రజలకు తెలుసునని, టీడీపీది మైండ్ గేమ్కి తాము లొంగిపోమని పొట్లూరి స్పష్టం చేశారు.