నవరత్నాలు, పాదయాత్రలతో ఎన్నికల వేడి రగిల్చిన వైసీపీ తటస్ధుల ఓట్లే లక్ష్యంగా కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. అన్నపిలుపు పేరుతో తటస్ధులను పార్టీ వైపు తిప్పుకునేందుకు కొత్త ప్రయత్నం చేపట్టింది. ప్రత్యేక సర్వే ద్వారా పలువురు ప్రముఖులను పీకే టీం ఎంపిక చేసింది. జిల్లా, పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా సామాజిక, సాంఘిక కోణంలో ఎంపిక చేసిన వారి జాబితాను జగన్కు అందజేసింది. వీరందరికి వైసీపీ అధినేత జగనే స్వయంగా లేఖలు రాయనున్నారు. వీరి ద్వారా తటస్ధ ఓటర్లను ఆకర్షించాలని వైసీపీ భావిస్తోంది.