నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓటర్ల సర్వే వివాదం మరో మలుపు తిరిగింది. సర్వే చేస్తున్న వారిపై దౌర్జన్యం, హత్యాయత్నం చేశారంటూ వైసీపీ కార్యకర్తలపై నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి వేదాయపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టారంటూ సి.ఐ నర్సింహులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పోలీసులు కేసుపెట్టారు. కోటంరెడ్డి కార్యాలయానికి చేరుకుని పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరెస్టును కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.