లగడపాటిది లత్కోర్‌ సర్వే: శైలజ చరణ్‌ రెడ్డి

Update: 2019-05-21 12:50 GMT

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్‌ సర్వే అని అన్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పూతలపట్టు నియోజకవర్గం ఎన్నికల అబ్జర్వర్‌ శైలజ చరణ్‌ రెడ్డి. ఆదివారం హైదరాబాద్‌లో ఆమె మాట్లాడుతూ ఆంధ్ర బెట్టింగ్‌ బుకీలతో డీల్‌ కుదుర్చుకొని బోగస్‌ సర్వేను ఆయుధంగా విడుదల చేశాడని ద్వజమెత్తారు .

లగడపాటి సర్వేలను తెలుగు ప్రజలు నమ్మే పరిస్ధితి లేదని, ఆయన సర్వేలకు కాలం చెల్లిందన్నారు. లగడపాటి సర్వే అంటేనే బెట్టింగ్‌ల కోసమే అనేది అందరికీ తెలిసిన రహస్యమే అన్నారు. తెలంగాణలో మహకుటమి గెలుస్తుందని ప్రకటించి బోల్తా పడ్డాడని, ఇప్పుడు అదే తప్పిదాన్ని పునరావృతం చేస్తున్నాడన్నారు. బెట్టింగ్‌లను ప్రోత్సహించేలా బోగస్‌ సర్వే విడుదల చేసిన లగడపాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమన్నారు.

Similar News