ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్లపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవన్నారు. చంద్రబాబు చేసిన తొలి సంతాలకే దిక్కు లేకుండా పోయిందన్నారు . బాబు పాలనలో పేదలు, రైతులు దగా పడ్డారంటూ ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. బాబు హయంలో జయంతి వర్ధంతికి తేడా తెలియని నారా లోకేష్కు మాత్రమే మంత్రి పదవి దక్కిందంటూ ఎద్దేవా చేశారు. బాబు ఐదేళ్ల పాలన గ్రాఫిక్స్కే పరిమితమైన మాట నిజం కాదా ? అంటూ ప్రశ్నించారు. సామాన్యురాలిగా ప్రశ్నిస్తున్న తనకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా ? అంటూ ప్రశ్నించారు.