వారిపై చర్యలు తీసుకోండి : కమిషనర్‌ను కోరిన వైఎస్‌ షర్మిళ

Update: 2019-01-14 06:56 GMT
YS Sharmila

వైసీపీ అధినేత జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిళ ఇవాళ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ను కలిశారు. తనపై, తన కుటుంబంపై సోషల్‌ మీడియాలో చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆమె ఫిర్యాదు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం ఉదయం షర్మిళ, భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటూ కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.

Similar News