ఇటివల ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. 13 జిల్లాలో 341 రోజుల పాటూ ప్రజలతో మమైకమై ఇచ్ఛాపురంలో ముగించిన విషయం తెలిసిందే కాగా మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు జగన్. రాబోయే ఎన్నికల నేపధ్యంలో ఏపీలో బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జగన్. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు జగన్ తెలిపారు. తమ పార్టీకి చెందిన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జ్లతో జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. సమర్థత ఉన్న వారికే ఎన్నికల ఇంఛార్జ్లుగా బాధ్యతలు అప్పగిస్తామని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సారి గెలుపే దిశగా అడుగులు వేస్తున్నారు జగన్.