ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను సాయంత్రం 4.45 గంటలకు ఆయన రాజ్భవన్లో గవర్నర్ను కలుస్తారు. పార్టీ సీనియర్ నేతలతో రాజ్భవన్ వెళ్తున్న జగన్ గవర్నర్ను కలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపుపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు వైయస్ జగన్.