ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఖరారైంది. ఈనెల 28న (మంగళవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో తిరుమలలో ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు. ఇక అక్కడి నుండి నేరుగా పులివెందులకు చేరుకొని స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రార్ధనలో పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్ లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. తరువాత గండి వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.