బాబు వచ్చాడు కానీ జాబు రాలేదు: జగన్

Update: 2019-03-23 07:39 GMT

టీడీపీ అదినేత చంద్రబాబుపై వైసీపీ అదినేత మరోసారి విమర్శలు గుప్పించారు శ్రీకాకుళం జిల్లా పలాసలో రోడ్ షో నిర్వహించిన జగన్ టీడీపీ పై విరుచుకుపడ్డారు. బాబు వచ్చాడు తప్ప జాబు రాలేదన్నారు. రైతులకు సున్నా వడ్డీకి రుణాలు రావడం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అందరి ఆశీస్సులతో పాదయాత్ర చేశానని ప్రజల సమస్యలు తెలుసుకున్నాన్నారు జగన్.  

Similar News