బాబూ ఆ హామీలు గుర్తున్నాయా..?

Update: 2019-03-29 06:47 GMT

2014లో ఇచ్చిన హామీలు గుర్తున్నాయా ? చంద్రబాబు అంటూ ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో పర్యటించిన ఆయన చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారంటూ ఆరోపించారు. జిల్లాలోని పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు దక్కక అల్లాడుతున్నా ఒక్క రోజు పట్టించుకోలేదన్నారు. టీడీపీపై ఆరోపణలు చేస్తూనే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికి మేలు చేస్తామన్నారు.  

Similar News