కర్నూలు జిల్లాలో వైసీపీకి మరో షాక్‌?

Update: 2019-02-22 12:05 GMT

కర్నూలు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలో చేరడంతో అలకబూనిన గౌరు ఫ్యామిలీ పార్టీకి గుడ్‌బై చెప్పాలని డిసైడైనట్లు టాక్ వినిపిస్తోంది. కాటసాని వచ్చాక పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత భావిస్తున్నారట. పైగా పాణ్యం టికెట్‌ విషయంలో జగన్ హామీ ఇవ్వలేదంటోన్న గౌరు ఫ్యామిలీ మూడ్రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే మార్చి 6న వైసీపీకి రాజీనామాచేసి తెలుగుదేశంలో చేరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

Similar News