శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, ఇప్పటికే వైసీపీ నుంచి పోటీ చేసే 9 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా మిగతా 16మంది అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టికెట్ రాని అభ్యర్థుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంతృప్తి చెందని నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుండి టికెట్ ఆశించి యలమంచిలి రవి చివరి క్షణంలో సీటు మార్పుతో ఆందోళన చెందారు.
ఇక దీంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రెబల్గా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ముందు నుంచే యలమంచిలి రవి విజయవాడ తూర్పు టికెట్ను ఆశించారు. స్థానిక రిపోర్టు ఆధారంగా ఆ స్థానాన్ని జగన్ బొప్పాన భావ్కుమార్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైయ్యారు యలమంచిలి. మరోవైపు యలమంచిలికి జనసేన పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. జనసేన అధిష్టానం ఈనెల 21న నామినేషన్ చేయాలని జనసేన కోరినట్లు యలమంచిలి సన్నిహితులు చెబుతున్నారు.