అధికారం కోసం ఏపీని టీఆర్ఎస్కు తాకట్టు పెట్టాలని జగన్ కుట్ర చేస్తున్నారని మంత్రి యనమల ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...మోడీ, కేసీఆర్, జగన్ కలిసి ఏపీలో టీడీపీ లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తెలుగుదేశాన్ని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేక మోడీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రల కూటమిగా ఏర్పడ్డారని యనమల ఆరోపించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నవారిలో జగనే ప్రథముడని యనమల మండిపడ్డారు.