ఇండియా పాకిస్తాన్ పై ఇష్టాన్ని చాటుకున్న వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్..
ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది .. ఈ మ్యాచ్ ఇప్పుడు అందరిని ఆకర్షించింది .. కేవలం రెండు దేశాలు మాత్రమే కాకుండా మొత్తం క్రికెట్ ప్రపంచం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. అయితే ఈ మ్యాచ్ పై వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఎదురుచూస్తున్నాడు . ఇండియా, పాక్ మ్యాచ్ నేపథ్యంలో ప్రత్యేకమైన డ్రెస్ తో తయారు చేయించుకుని, దాన్ని ధరించి ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో పెట్టాడు. అందులో కుడి వైపు భారత పతాకంలోని మూడు రంగులు, ఎడమ వైపు పాక్ జెండా రంగైన ఆకుపచ్చ రంగుతో ఈ డ్రస్ కనిపిస్తోంది. తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 20న కూడా ఇవే దుస్తులను తాను ధరిస్తానని క్యాప్షన్ పెడుతూ, గేల్ ఈ ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. గేల్ కు రెండు దేశాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే.