రైతున్నలకు మరో తీపి కబురు...ఈ ఏడాది...

Update: 2019-04-23 08:38 GMT

అన్నదాతలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది అనుకున్న సమయానికే వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ చెప్పిన సమయంలోనే మరో శుభవార్త వినబడింది. ఈ ఏడాది అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు బంగాళఖాతంలో ముందే ఏర్పడుతున్న ఉపరితల ద్రోణుల అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్టు ఐఎండీ భావిస్తోంది. శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ముందుగానే ఏర్పడతాయని అంచనా వేసింది.   

Similar News