నెల్లూరు జిల్లాలో వీవీప్యాట్ స్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఆత్మకూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వందలకొద్దీ వీవీ ప్యాట్ స్లిప్పులు వెలుగుచూశాయి. సుమారు 300 లకు పైగా ఉన్న స్లిప్పులను ఆర్డీవో బృందం స్వాధీనం చేసుకుంది. వీవీప్యాట్ స్లిప్పులు ఎలా బయటపడ్డాయనేదానిపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించారు. అయితే ఈ ఘటనతో రాజకీయపార్టీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.