విజయశాంతి అరెస్ట్‌.. ఉద్రిక్తత

Update: 2019-04-25 08:25 GMT

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉదృతం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. వరంగల్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ధర్నా కార్యక్రమం సందర్భంగా పోలీసులు విజయశాంతిని అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండేటి శ్రీధర్‌లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ముట్టడి సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాలలో అవకతవకలు జరిగి 5 రోజులు గడిచినా దొర మాత్రం ఎమ్మెల్యేలను కొనే బిజిలో ఉన్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. 




 


Similar News