తిరుమల శ్రీవారి సమక్షంలో మోడీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హన్మంతరావు డిమాండ్ చేశారు. మోడీ మోసం చేసినా కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలు అండగా నిలుస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్ హామీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెరవేరుస్తారని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబానికి మాట తప్పే అలవాటు లేదని చెప్పారు.