ఈ రోజుతో టిడిపి చచ్చిపోయింది..

Update: 2019-05-23 06:39 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతుంది .. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ  ఓటమిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించారు . వరుసగా సెటైరిక్‌ ట్వీట్లతో దండయాత్ర మొదలు పెట్టారు.  సైకిల్‌ టైర్‌ పంక్చర్‌ అయిందనే సెటైరిక్‌ మీమ్‌తో మొదలు పెట్టిన వర్మ.. టీడీపీ పుట్టింది 1982, మార్చి 29 అని, చచ్చింది మాత్రం 2019, మే 23 అని తెలిపారు. టీడీపీ చావుకు.. అబద్దాలు, వెన్నుపోట్లు, అవినీతి, అసమర్థత, నారాలోకేష్‌, వైఎస్‌ జగన్‌ చరిష్మా కారణమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు తన మామ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చేసిన మోసం గుర్తుకువస్తుందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 150 సీట్ల ఆధిక్యంలో ఉండగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతుంది ...

Similar News