హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హిందీ సబెక్టుపై పీహెచ్డి చేస్తున్న దీపికా మహాపాత్ర బాత్రూలో పడిపోయి చనిపోయింది. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన దీపిక మహాపాత్ర కొంత కాలంగా న్యూరో సమస్యతో బాధపడుతున్నట్టుగా సహచర విద్యార్థినులు చెబుతున్నారు. అయితే సోమవారం నాడు తెల్లవారుజామున ఆమె బాత్రూమ్లో పడి మృతి చెందింది. దీపిక మరణించిన విషయాన్ని కాలేజీ యాజమాన్యం కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.