ఇంటర్ ఫలితాల్లో అక్రమాలు, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గత 5రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే కాగా సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన ఆయన దీక్ష శుక్రవారం పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ముగిసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ లక్ష్మణ్ను పరామర్శించి లక్ష్మణ్తో దీక్ష విరమింపజేశారు. లక్ష్మణ్ను పరామర్శించిన వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తెలంగాణ ఇన్చార్జి కృష్ణదాస్, ఎంపీ దత్తాత్రేయ ఉన్నారు.