శబరిమల పరిసర ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంబ బేస్ క్యాంప్ దాటి వెళ్తుండగా నీలిమల వద్ద వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. అనంతరం ఆ మహిళలను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. శబరిమల ఆలయాన్ని అన్ని వయస్సుల మహిళలు దర్శించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పుతో కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు.