భారత ఆర్మీ దెబ్బకు తిరుగుటపా కట్టిన పాకిస్తాన్ ఆర్మీ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పుకొచ్చింది. పాక్ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు తెలిపింది. పీఓకేలో ఒకటి, జమ్ము కశ్మీర్లో మరో భారత యుద్ధవిమానాన్ని కూల్చేసినట్లు ప్రకటించుకుంది. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్ను అదుపులోకి తీసుకొన్నట్లు చెప్పింది. అయితే మన రెండు యుద్ధ విమానాలు కూల్చివేసినట్టు పాకిస్తాన్ చెబుతున్న మాటల్లో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. దాడులు జరిగినట్టు పాక్ మీడియా చూపిస్తున్న దృశ్యాలు జోధ్పూర్ ప్రమాదానికి సంబంధించినవని తెలిపింది. పాత దృశ్యాలు చూపించి పాక్ తప్పుదారి పట్టించే ప్రయత్నిస్తోందని విమర్శించింది.