అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు డిష్యూం డిష్యూం...

Update: 2019-04-21 13:22 GMT

ఒక అమ్మాయి కోసం ఇద్దరు యువకులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గుడ్డలు ఉడేలా పొట్టు పొట్టు కొట్టుకున్న సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి హలసూరు గేట్‌ సమీపంలోని ధర్మరాయ దేవాలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే హలసూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఓకే అమ్మాయిని గాఢంగా ఇష్టపడ్డారు. అంతే ఇక ప్రేమ వ్యవహారమై ఇద్దరి మధ్య చిచ్చుపెట్టింది. ఇక ఇద్దరి మధ్య చాలా రోజులుగా గొడవలు అవుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో మొన్న రాత్రి శుక్రవారం హలసూరు గేట్‌ సమీపంలోని ధర్మరాయ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కరగ ఉత్సవం చూడడానికి వెళ్లిన ఈ ఇద్దరు యువకులు ఎదురెదురుగా ఒకరిపై మరోకరు మాటల యుద్ధంతో మొదలై అది చిలికి చిలికి గాలివానై ఇద్దరు పొట్టుపొట్టు తన్నుకునేకాడికి వచ్చింది. ఒకరిపై మరోకరు దాడి చేసుకున్నారు. చేతికి ఎదీ దొరికితే దానితో కొట్టుకున్నారు. ఆ అమ్మాయి నాకే సొంతం అంటూ ఇరువురి మధ్య మహాయుద్ధంలాంటిదే జరిగిందనుకో ఇక స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఒక్క అమ్మాయి కోసం మొదలైన ఈ కొట్లాట ఎంత వరకు పొతుందో అని అనుకుంటున్నారు అక్కడి స్థానిక జనాలు.




 


Similar News