విషాదం...ట్రంకు పెట్టేలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు

Update: 2019-06-01 09:00 GMT

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలం చిన్నయ్య పాలెంలో పదేళ్ల వయస్సున్న ఇద్దరు అబ్బాయిల మృతదేహాలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని ట్రంకు పెట్టెలో ఇద్దరి డెడ్‌బాడీలు బయటపడ్డాయి. పాఠశాల ఆవరణలో చిన్నారులు క్రికెట్ ఆడుతున్న క్రమంలో బంతి పాఠశాలలో పడగా దాన్ని వెతికే క్రమంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో భయంతో చిన్నారులు గ్రామస్తులకు చెప్పగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అసలీ హత్యలు ఎవరు చేశారు..? దీని వెనుక కారణాలేంటని దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Full View 

Similar News