వీలైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలి
వీలైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందుకోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
వీలైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందుకోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. పార్టీని పటిష్టంగా మలిచి పార్లమెంట్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే పరిస్థితి లేదన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో చొప్పదండి, హుజుర్ నగర్ నియోజకవర్గాల టీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు.