ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ నుంచి నవీన్కుమార్ ధృవపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నవీన్కుమార్ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి అభినందించారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి గన్పార్క్ వరకు ర్యాలీగా బయల్దేరి గన్పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.