తెలంగాణ ఉద్యమాన్ని 2001లో కేసీఆర్ ఒంటరిగా మొదలు పెట్టారని 71 ఏళ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయని కానీ గట్టిగా నిలబడిన పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సం సందర్బంగా టీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 16 లోక్సభ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే గెలుపని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నామని పార్టీ నేతలతో అన్నారు. పార్టీలో కొత్త, పాతవారికి అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.