నేడు సీఈసీని కలవనున్న వైసీపీ నేతలు

Update: 2019-04-15 04:48 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలకు కౌంటర్‌గా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వైసీపీ బృందం ఢిల్లీ వెళ్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ మాజీ ఎంపీలతో కూడిన బృందం ఎన్నికల కమిషన్‌ను సాయంత్రం 5 గంటలకు కలవనున్నారు. ఈ సాయంత్రం సీఈసీని కలవనున్న వైసీపీ నేతలు పోలింగ్ రోజున టీడీపీ చేసిన దాడులు, దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయనున్నారు. పోలింగ్ తర్వాత కూడా టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

Similar News