నేడు పార్లమెంట్ ఉభయ సభలలోని అన్ని పక్షాల నేతలతో ప్రభుత్వం సమావేశం కానుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మోడీ ప్రభుత్వం సమాయత్తమౌతోంది. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అఖిల పక్ష భేటీ జరగనుంది. అలాగే మధ్యాహ్నం బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశం, అనంతరం ఎన్డీఏ నాయకుల సమావేశం జరగుతుంది.