రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. సెకండ్ ఫేజ్లో 3వేల 342 గ్రామాలకు ఎన్నికలు జరగగా ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు దాదాపు 900 పంచాయతీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ వందకి పైగా గ్రామాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇతరులు సుమారు 170కి పైగా గ్రామ పంచాయతీల్లో హవా చూపించారు.