తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, రియాజ్ ఉల్ హసన్, యెగ్గే మల్లేశంలు ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ఛాంబర్ లో వీరంతా ప్రమాణస్వీకారం చేశారు. మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు, జిల్లాల నేతలు పాల్గొన్నారు.