'పరిషత్‌' కౌంటింగ్‌ వాయిదా

Update: 2019-05-25 00:57 GMT

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఈ నెల 27 ఎన్నికల ఫలితాలు ప్రకటించాల్సి ఉండగా రాజకీయ పార్టీల విజ్ఞప్తులతో కౌంటింగ్‌ను వాయిదా వేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మూడు విడుతల్లో జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఫలితాలు ప్రకటించాలి. అయితే, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల ఎన్నికకు ఇంకా 40 రోజులకుపైగా సమయం ఉండటంతో ఈలోగా అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసే అవకాశముందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందాయి. పార్టీల ఫిర్యాదుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపారు.

Full View

Similar News