పరిషత్ ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారు

Update: 2019-05-28 13:30 GMT

తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారైంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజున ఉదయం 8 గంటలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు తెలిపింది. మే 27వ తేదీన పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించాలని మొదట భావించినప్పటికీ నల్గొండ, వరంగల్, రంగారెడ్డి శాసనమండలి ఎన్నిక ఈ నెల 31న జరగనుంది. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ 3న ఉండటంతో అవి ముగిసిన వెంటనే పరిషత్ ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు.

Similar News