రేపు విడుదలకానున్న మహర్షి సినిమా టిక్కెట్ల ధరల అంశంపై గందరగోళం నెలకొంది. టిక్కెట్ల ధరలు పెంచుకోడానికి తమకు కోర్టు అనుమతించిందంటూ చిత్ర నిర్మాత దిల్ రాజు చెబుతుండగా అసలు టిక్కెట్ ధరల పెంపు అంశం ప్రభుత్వ పరిధిలోనిదని మంత్రి తలసాని స్పష్టం చేస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి అదనంగా 5 వ షో కి అనుమతిచ్చామని అంతేకాని టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని తామెక్కడా చెప్పలేదని మంత్రి తలసాని తేల్చిచెప్పారు. 79 థియేటర్లు టిక్కెట్ రేట్లు పెంచినట్లు తమకు దృష్టికి వచ్చిందన్న మంత్రి ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు.