తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ట్విటర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు రాష్ట్రపతి కోవింద్. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు చంద్రబాబు నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నాను
— President of India (@rashtrapatibhvn) June 2, 2019
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తూ, వారి ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువకావాలని కోరుకుంటున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) June 2, 2019
On their Statehood Day, I extend my warm wishes to our sisters and brothers of Telangana. I pray for the progress and prosperity of the state in the times to come.
— Amit Shah (@AmitShah) June 2, 2019